అహ్మదాబాద్: ఆయుర్వేదిక్ సిరప్ తాగి (Ayurvedic Syrup) ఐదుగురు మరణించారు. మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఆయుర్వేదిక్ టానిక్లో విషపూరిత మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిలోదర గ్రామానికి చెందిన ఒక షాపు వ్యక్తి ‘కల్మేఘాసవ్ – అసవ అరిష్టా’ అన్న బ్రాండ్తో కూడిన ఆయుర్వేద టానిక్ను సుమారు 50 మందికి విక్రయించాడు. రెండు రోజుల్లో ఈ సిరప్ తాగి ఐదుగురు మరణించారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆయుర్వేదిక్ సిరప్ అమ్మిన వ్యక్తితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆయుర్వేద టానిక్ తాగిన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రక్త నమూనాలను పరిశీలించినట్లు తెలిపారు. విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ ఆ సిరప్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.