న్యూఢిల్లీ : పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు రాజకీయ ప్రముఖులు తమతమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని యానం జిల్లాలో అత్యధికంగా 85.76 శాతం పోలింగ్ నమోదైంది. మహే నియోజకవర్గంలో అత్యల్పంగా 69.92 శాతం జరిగింది.
పుదుచ్చేరి జిల్లాలో 78.14 శాతం, కరైకల్ జిల్లాలో 76.14 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 30 శాసనసభ స్థానాలుండగా 324 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఎన్నికల్లో 10 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బ్యాక్సుల్లో నిక్షిప్తమైంది. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి