న్యూఢిల్లీ, జూన్ 2: త్వరలో రానున్నట్లు అంచనా వేస్తున్న కరోనా థర్డ్వేవ్ కూడా సెకండ్వేవవ్లాగే తీవ్రంగా ఉండే అవకాశముందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. ఇది 98 రోజులపాటు కొనసాగవచ్చని తెలిపింది. థర్డ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా సిద్ధమై ఉండాలని, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించింది. తద్వారా సీరియస్ కొవిడ్ కేసులను కూడా సులభంగా ఎదుర్కోగలమని, ఆక్సిజన్, బెడ్లు, ఐసీయూల అవసరం భారీగా తగ్గుతుందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. అంతేగాక కరోనా మరణాలను కూడా భారీగా తగ్గించవచ్చని వెల్లడించింది. ‘థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్లను దృష్టిలో ఉంచుకొని మనం వ్యూహాలు రూపొందించుకోవాలి. కొన్ని దేశాలు పిల్లలకు టీకాలు వేయడానికి భారీగా వ్యాక్సిన్లను కొనుగోలు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ముందస్తుగా టీకాలను కొనుగోలు చేసుకోవడం మంచింది’ అని ఎస్బీఐ తన నివేదికలో వివరించింది.