న్యూఢిల్లీ : నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) మూడో అపెక్స్ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన సమస్యలు, పరిష్కారాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ అరవింద్ కుమార్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్, సశాస్త్ర సీమాబల్, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వారి ప్రతినిధులు పాల్గొన్నారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కేసుల్లో సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు ఇంతకు ముందు రెండుసార్లు సమావేశం నిర్వహించింది. తాజా సమావేశంలో ఎన్డీపీఎస్ పాలసీకి సంబంధించిన సమస్యలు, డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల కార్యాచరణ వ్యవహారాలపై చర్చించారు.