న్యూఢిల్లీ, డిసెంబర్ 29: సైనికుల సౌకర్యార్థం తొలి అత్యాధునిక 3డీ ప్రింటెడ్ నివాస యూనిట్లను తయారు చేశారు. అహ్మదాబాద్ కంటోన్మెంట్లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు భారత ఆర్మీ తెలిపింది. త్రీడీ ప్రింటెడ్ నివాస యూనిట్ను 71 చదరపు మీటర్ల వ్యత్యాసంలో పునాది, గోడలు, శ్లాబ్లు సహా గ్యారేజ్ను కేవలం 12 వారాల్లో నిర్మించినట్టు వెల్లడించింది. మికాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో నిర్మించింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా దీన్ని నిర్మించినట్టు ఆర్మీ పేర్కొన్నది.