బెంగళూరు, ఆగస్టు 21: కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి 31వ జన్మదినోత్సవాన్ని సోమవారం కర్ణాటకలోని శృంగేరిలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వేద విద్వాంసులు, ఆధ్మాతిక, ధార్మికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారుద్రయాగం నిర్వహించగా, పూర్ణాహుతి కార్యక్రమంలో ఉభయ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీస్వామి పాల్గొన్నారు. ప్రత్యేక అనుష్ఠానం తర్వాత విధుశేఖర భారతీస్వామి వేలాది మంది భక్తులకు ఆహ్నిక దర్శనం కల్పించారు.