లక్నో: ఎక్స్ప్రెస్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనాన్ని ఢీకొట్టడంతో అది నుజ్జయ్యింది. ఎస్యూవీ డ్రైవర్తోపాటు ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (SUV Collides With Truck) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మీరట్ ఎక్స్ప్రెస్ వేపై ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ఎస్యూవీ ఢీకొట్టింది. అదుపు తప్పున ఆ కారు మరో చిన్న లారీని ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎస్యూవీ డ్రైవర్తోపాటు ఇద్దరు పిల్లలు మరణించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నుంచి ఢిల్లీకి 11 మంది పిల్లలతో వెళ్తున్న ఎర్టిగా కారు ఆగి ఉన్న డంపర్ లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. జామియాలో 6వ తరగతి పరీక్షకు హాజరయ్యేందుకు పిల్లలు ఆ కారులో వెళ్తున్నారని చెప్పారు.
మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, పిల్లలను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే డ్రైవర్ అనాస్, ఇద్దరు పిల్లలు ఉనేష్, ఆజం మరణించినట్లు చెప్పారు. ఇంధనం అయిపోవడంతో ఎక్స్ప్రెస్ వేపై లారీ ఆగిపోయిందని తెలిపారు. లారీ డ్రైవర్ సద్దాంను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఎక్స్ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tragic Road Accident on Meerut-Delhi Expressway Claims Lives of Exam-Bound Jamia students
"Road accident on the Meerut-Delhi Expressway. A dumper truck was parked on the main lane.
A Maruti Ertiga car entered from behind. The car's driver and 2 students died.
These students… pic.twitter.com/9HXGUhYU25
— Atulkrishan (@iAtulKrishan1) March 31, 2024