లక్నో: ఉత్తరప్రదేశ్లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు. డుమ్రిలో ఓ గృహిని ఛాయ్ పెడుతుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకుని గృహిని సహా ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, తల్లి సహా ముగ్గురు పిల్లలు చనిపోయారని డోరియా ఎస్పీ సంకల్ప్ శర్మ చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.