హరిద్వార్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్(Haridwar)లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ శిథిలాల నుంచి ముగ్గురు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. హరికిపౌరి.. బీమా గోండా రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ బైక్ కాస్త స్కిడ్ అయ్యింది. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వాళ్లను లాగేశాడు.
Uttarakhand: Three youths on a bike narrowly escaped disaster as landslide debris fell over them in Haridwar. #Uttarakhand #UttarakhandNews pic.twitter.com/4gMHwbG25i
— Siddharth (@Siddharth_00001) August 6, 2025
మంగళవారం హరిద్వార్లో భారీగా వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. గంగా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఘాట్ల వద్దకు వెళ్లరాదు అని పోలీసులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో వైపు ఉత్తరకాశీలో క్లౌడ్బస్ట్తో వచ్చిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 130 మందిని రక్షించారు. ప్రస్తుతం ధారాలీ గ్రామ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ నిర్వహిస్తున్నాయి.