చెన్నై : తమిళనాడు శివగంగై జిల్లాలో 2018లో ముగ్గురు దళితులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగేండ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో 27 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పెషల్ కోర్టు నిన్న తీర్పు వెల్లడించింది. కచనథం గ్రామంలోని ఎస్సీ కులానికి చెందిన అరుముగం(65), శణ్ముగనాథన్(31), చంద్రశేఖర్(34)ను తిరుప్పచెట్టి సమీపంలో అత్యంత దారుణంగా చంపారు. ఈ ఘటన 2018, మే 28న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇదే దాడిలో మరో ఐదుగురు దళితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిలో ఒకరైన థనశేఖరన్(32) ఘటన జరిగిన ఏడాదిన్నరకు చనిపోయాడు.
ఓ టెంపుల్ ఫెస్టివల్లో అగ్రకులాల వ్యక్తులకు గౌరవం ఇవ్వలేదనే కోపంతో ఆ ముగ్గురిని చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు 33 మందిపై చార్జీషీటు దాఖలు చేశారు. అయితే ఇందులో నలుగురు మైనర్లు ఉన్నారు. మైనర్లలో ఇద్దరూ విచారణ జరుగుతున్న సమయంలోనే చనిపోయారు. ఒకరు తప్పించుకొని పోయారు.