బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులోని వుమెన్స్ పీజీ హాస్టల్లో మంగళవారం 24 ఏళ్ల అమ్మాయి హత్యకు(Bengaluru Murder) గురైంది. కోరమంగల వెంకటరెడ్డి లే అవుట్లో ఉన్న భార్గవి స్టేయింగ్ హోమ్స్లో ఈ హత్య జరిగింది. బీహార్కు చెందిన కృతి కుమారి దారుణంగా హత్యకు గురైంది. సంచలనం రేపిన ఆ మర్డర్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో శుక్రవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోకి వెళ్లిన నిందితుడు .. తన వద్ద ఉన్న కత్తితో కృతి కుమారిపై అటాక్ చేశాడు. బిల్డింగ్లోకి రాత్రి 11 గంటలకు చొరబడి, ఆమె మెడను కోశాడు. ఆ తర్వాత అక్కడనుంచి అతను పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కుమారితో పాటు ఆ రూమ్లో మరో అమ్మాయి ఉంటుంది. ఆమె స్నేహితుడే నిందితుడు అభిషేక్. అయితే నిందితుడు అభిషేక్ ప్రతిసారి కుమారి రూమ్మేట్తో గొడవపడేవాడు. ఆ ఇద్దరి మధ్య గొడవ ముదిరినప్పుడు.. కృతి కుమారి సర్దిచెప్పేది. అయితే అభిషేక్కు దూరంగా ఉండాలని తన మిత్రురాలికి కుమారి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆగ్రహానిక గురైన నిందితుడు.. కుమారిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హాస్టల్ కారిడార్లో జరిగిన ఈ మర్డర్ సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. కుమారి రూమ్ డోర్ తట్టిన నిందితుడు, ఆ తర్వాత ఆమెను కారిడార్కు లాక్కెల్లాడు, గోడకు ఆమెను నెట్టేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా..నిందితుడు ఆమెను నిలువరించాడు. ఆమె మెడలో కత్తితో దాడి చేశాడు. అరుపులతో అక్కడకు చేరుకున్న జనం.. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు కమీషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు గ్రూపులుగా అన్వేషించారు.
This happened in a PG hostel in Koramangala, Bengaluru 3 days ago
The killer has not been caught yet
He brutally killed Kriti Kumari by slitting her neck which was caught in CCTV camera but police haven’t caught him yet. This is how Law and order has deteriorated in our city… pic.twitter.com/vMO1SZykGv— Swathi Bellam (@BellamSwathi) July 26, 2024