లక్నో : ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా బబినా కంటోన్మెంట్ పరిధిలో ఘోరం జరిగింది. T-90 ట్యాంక్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ సమయంలో ట్యాంక్ పేలినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాలని కోర్టును భారత ఆర్మీ అధికారులు కోరారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం బబినా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మృతి చెందారని పేర్కొన్నారు. ట్యాంక్ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇద్దరు మృతుల్లో ఒకరిని జేసీవో(Junior Commissioned Officer) గా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.