హోషియాపూర్: పంజాబ్లోని హోషియాపూర్లో జరిగిన దొంగతనం సందర్భంగా 21 ఏండ్ల యువకుడు, 8 ఏండ్ల బాలుడు మరణించారు. ఓ మహిళ తన 8 ఏండ్ల కుమారుడిని, 21 ఏండ్ల అల్లుడిని స్కూటర్పై తీసుకెళ్లుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె హ్యాండ్బ్యాగ్ను పట్టుకొని లాగారు.
దీంతో ఆమె స్కూటర్పై నియంత్రణ కోల్పోయి ముందున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కిందపడిపోగా.. యువకుడు, బాలుడు ట్రాక్టర్ టైర్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. మహిళ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.