బాలాఘాట్, మార్చి 18: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఓ శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, మహిళా ట్రైనీ పైలట్ మరణించారని అధికారులు తెలిపారు. బాలాఘాట్ జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత పర్వత ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. పూర్తిగా కాలిపోయిన ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నామని ఎస్పీ సమీర్ తెలిపారు.
ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ (ఐజీఆర్ఏయూ)కి చెందిన ఈ యుద్ధ విమానం ప్రమాదానికి గురికావడానికి ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.