న్యూఢిల్లీ: సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూలినట్లు(Sukhoi Crash) భారతీయ వైమానిక దళం ప్రకటించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలెట్లు మృతిచెందినట్లు ఐఏఎఫ్ కన్ఫర్మ్ చేసింది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ కూలింది. ప్రమాదంలో మృతిచెందిన పైలెట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్గా గుర్తించారు. ఐఏఎఫ్ దళ సభ్యులందరూ ఆ పైలెట్ల మృతి పట్ల సంతాపం చెబుతున్నారని ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ట్రైనింగ్ మిషన్లో భాగంగా గురవారం సుఖోయ్-ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలోకి ఎగిరింది. అయితే జోర్హాట్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ విమానం రేడార్ నుంచి అదృశ్యమైంది. ఎయిర్బేస్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలినట్లు గుర్తించారు. రాత్రి 7.42 నిమిషాలకు ఆ విమానంతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నది. సమీప కొండ ప్రాంతంలో కూలినట్లు తేల్చారు. కొండ మీద నుంచి భారీ స్థాయిలో శబ్ధం వచ్చినట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. మంటలు కూడా వ్యాపించినట్లు చెప్పారు.
సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్.. టూ సీటర్ ఇంజిన్. రష్యా విమాన తయారీ కంపెనీ సుఖోయ్ దీన్ని డెవలప్ చేసింది. లాంగ్ రేంజ్ ఫైటర్ జెట్గా దీన్ని గుర్తించారు. ప్రస్తుం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ లైసెన్సు కింద ఆ యుద్ధ విమానాన్ని నిర్మిస్తున్నారు.
IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr
— Indian Air Force (@IAF_MCC) March 6, 2026