న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రేటు 6.7 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి 1,09,345 మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజులోనే 315 మంది ప్రాణాలు విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,85,350కి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 14.78 శాతంగా ఉంది. ఇక నిన్న ఒక్క రోజే 5,753 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఇక దేశ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వద్ద సుమారు 15 కోట్ల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.