న్యూఢిల్లీ: 19 వేల మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించబోతున్నామని ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 2.5 శాతం మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపింది.
తొలగింపు ప్రక్రియను 18 నెలల్లో పూర్తిచేయనున్నట్టు వెల్లడించిందది. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో వేతనాలు, ఇతర ఖర్చులు తగ్గించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని వివరించింది.