న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలోని మూడు గ్రామాలపై వారం క్రితం దుండగులు జరిపిన దాడుల్లో 170 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. రీజనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలి బెంజమిన్ కౌలిబలీ ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు.
కొమ్సిల్గా, నోడిన్, సోరోయీ గ్రామాలపై ఫిబ్రవరి 25న ఈ దాడులు జరిగాయి. ఈ దాడులపై దర్యాప్తునకు ఆదేశించారు. అల్ ఖైదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నాయి.