లక్నో: ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే యువకుడు అనురాధ బింద్ అనే 15 ఏండ్ల బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను అనురాధ అంగీకరించలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అరవింద్.. తనకుకాకుండా మరొకరికి ఆ అమ్మాయి దక్కొందని అనుకున్నాడో ఏమో.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
బుధవారం తన సోదరితో కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్తున్న అనురాధను దారిలో అడ్డగించాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో ఆమె తలపై కాల్చాడు. దీంతో ఆమె వెంటనే కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.