హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్ చిక్కుకుపోయిన 60 మందిని భారత పౌరులను ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చింది. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను బహ్రెయిన్ తెలుగు అసోసియేషన్, గల్ఫ్ ఎయిర్ అక్కున చేర్చుకున్నాయి.
ఫిబ్రవరి 28నుంచి స్థానిక తెలుగు కుటుంబాలు, చర్చిలు 60 మందికి అల్పాహారం, భోజనం, వసతి కల్పించాయి. అంతేకాదు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులను నిర్వహించాయి. భారత పౌరుల పరిస్థితిని మీడియా ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దౌత్య సమన్వయం ద్వారా వారికి సౌదీ అరేబియా నుంచి ట్రాన్సిట్ వీసాల జారీకి కృషి చేసింది. అనంతరం దమ్మామ్ నుంచి కొచ్చికి ప్రత్యేక విమానం ద్వారా సురక్షితంగా వారు ఇండియాకు చేరుకున్నారు.