కోల్కతా, జనవరి 23: రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు సెలవు ప్రకటించరని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నేతాజీ జయంతి రోజున సెలవు ప్రకటించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నేతాజీ అదృశ్యమై ఏండ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం తెలియకపోవడం దేశానికి అవమానకరం అని అన్నారు.