(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ గిరిజన వ్యతిరేకులేనని పీపుల్స్వార్ ఆరోపించింది. ఆ రెండు పార్టీల నేతలకు ఓట్లు వేసి గెలిపించి లాభం లేదని, ఛత్తీస్గఢ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చింది.
దక్షిణ సబ్ జోనల్ బ్యూరో పేరిట జారీ చేసిన ఓ లేఖలో పీపుల్స్వార్ నాయకులు ఎన్నికలను బహిష్కరించాలని బస్తర్ ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. పీపుల్స్వార్ అధికార ప్రతినిధి సమత జారీ చేసిన ఈ ప్రకటనలో, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేట్ తొత్తులని మండిపడ్డారు.