యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతాన్ని వినిపించి మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. సుమారు 13 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఖజానాకు రూ.17,35,324 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.