నకిరేకల్, డిసెంబర్ 28 : నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన మన ఊరు- మన బడి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులకు సూచించారు. నకిరేకల్ బాలికల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న టాయిలెట్స్, ప్రహరీ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తున్నదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదా పు 85 పాఠశాలలో అభివృద్ధి పనులకు సుమారు రూ.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. దాదాపుగా అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయని, కొన్నిచోట్ల టెండర్ ప్రక్రియలో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ నాగయ్య, నాయకులు పెండెం సదానందం, మాద నగేశ్గౌడ్, నడికుడి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
జీఎంఆర్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
నకిరేకల్-తిప్పర్తి రోడ్డులోని అండర్పాస్ వద్ద జీఎంఆర్ అధికారుల నిర్లక్ష్యంతోనే పైప్లైన్ పనులు పెండింగ్ పెట్టడంపై ఎమ్మెల్యే చిరుమర్తి జీఎంఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభించాలని, ప్రజావసరాలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
పలు కుటుంబాలకు పరామర్శ
నార్కట్పల్లి : మండలంలోని ఔరవాణి గ్రామానికి చెందిన గాదె జాన్రెడ్డి ఇటీవల రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం జాన్రెడ్డి తండ్రిని పరామర్శించి రూ. 50వేలు ఆర్థికసాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన నడిగోటి యాదమ్మ, ఒర్సు యాదమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ముక్కాముల శ్రీను, నీరుడు షణ్ముకా రెడ్డి, రవి అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొంది ఔరవాణి గ్రామంలోని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచ్ మాదగోని ఆండాలు, నర్సింహ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి, గోదాల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.