బొడ్రాయిబజార్, డిసెంబర్ 4 : సర్వ మానవాళికి భగవద్గీత అనుసరణీయమని త్రిదండి అహోబిల రామానుజ జీయర్స్వామి అన్నారు. భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఆలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణం, 1000 మందితో సహస్రగళ గీతార్చన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సృష్టిలో సకల జీవరాశికి మూలాధారం శ్రీకృష్ణ పరమాత్ముడని అన్నారు.
వేదశాస్త్ర పరిజ్ఞానాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడని పేర్కొన్నారు. ప్రతి జీవుడిని నడిపించేది పరమాత్మ అన్నారు. భగవద్గీత జయంతిని పెద్దఎత్తున నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్, ఎన్సీహెచ్. వేణుగోపాలాచార్యులు, తోట శ్యాంప్రసాద్, నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్, గజ్జల రవీందర, తోట గణేశ్, బైరు విజయకృష్ణ, నామిరెడ్డి సత్తిరెడ్డి, గట్ల సోమయ్య, మొరిశెట్టి రామ్మూర్తి, నాగవెల్లి దశరథ, రవిచంద్ర, దినేశ్, రాచర్ల వెంకటేశ్వర్రావు, ఆయా ఆలయాల అర్చకులు, వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.