నకిరేకల్, ఏప్రిల్ 21 : ఈ నెల 29,30 తేదీల్లో పట్టణంలోని షిర్డీ సాయిబాబా మందిర 17వ వార్షికోత్సవం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల కరపత్రాన్ని ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ గాజుల సుకన్య, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్రెడ్డి, కోశాధికారి ఉప్పల వెంకటరమణ, సహాయ కార్యదర్శి బానాల రాంరెడ్డి, వలిశెట్టి స్వప్న, తొనుపునూరి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నోముల గోవిందరాజులు, బండారు వేణుగోపాల్, వీరవెల్లి హరినాథ్, కూరెళ్ల శ్రీనివాస్, పిల్లలమర్రి సునీత, దాచేపల్లి శ్రీనివాస్, దేవరశెట్టి మధుసూదన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.