రామగిరి, మే 8 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉండగా.. 11 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందిస్తున్నారు. మొత్తంగా ఫస్టియర్ విద్యార్థులు 410 మంది పరీక్షకు హాజరు కాగా 265 మంది (64.63శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలను 395 మంది రాయగా.. 315 మంది (79.70 శాతం) పాసయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో పెద్దవూర పాఠశాల అత్యధికంగా 91శాతం, అతి తక్కువగా దేవరకొండ నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అత్యధికంగా మునుగోడు పాఠశాల 98శాతం, దేవరకొండ విద్యాలయం 44శాతం ఉత్తీర్ణత సాధించారు.
మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 96మంది పరీక్షలు రాయగా 62మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 118మందికి 77మంది పాసయ్యారు. సెకండియర్ ఎంపీసీలో ఎ.స్రవంతి 968, సానియా 959, కె.పూజ 946, బైపీసీలో ఎం.పురుషోత్తం 984, యుక్త ప్రసన్న 978, బి.నవీన్ 978, ఎంఈసీలో సీహెచ్ అభినయశ్రీ 952, సీఈసీలో గౌతమి 863 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో కె.రమ్య 464, యు.మనీషా 433, బైపీసీలో ఎస్.సిరి 393, సీఈసీలో పి.చందన 447, ఎం.శృతి 445 మార్కులు సాధించారు.
గురుకుల కాలేజీ విద్యార్థులు..
గురుకుల జూనియర్ కాలేజీ విద్యార్థిని కొర్ర లావణ్య సెకండియర్ బైపీసీలో 990 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. వీజీ సిరి 981, ఎం.రుక్ముణి 979, ఎ.శరత్చంద్రిక 976, కె.విజిత 975 మార్కులు సాధించారు. ఎంపీసీలో ఆర్ ఝాన్సీ, ఎస్.హనీ, వి.అనూష, ఎ.జ్యోతి 986 మార్కులు తెచ్చుకున్నారు. బి.పావని 985, బి.శిరీష 984, పి.దీపిక 982 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలో ఎం.హారిక 434, సాధ్విక 433, బి.ఉమామహేశ్వరి, ఐలేశ్ 432, వై.హన్సిక, సీహెచ్.నవ్య 430 మార్కులు పొందారు. ఎంపీసీలో వి.గాయిత్రి 466, యు.కావ్యశ్రీ, జి.శృతి, ఎం.నిచ్చల, డి.శ్రీహిత, సీహెచ్ కళ్యాణి, డి.ధనలక్ష్మి 464 మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ విభాగం (ఎంపీహెచ్డబ్ల్యూ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎ.రేణుక 964, సనాఆఫ్రిన్ 935, అదే గ్రూప్ ఫస్టియర్ విద్యార్థిని సీహెచ్.స్ఫూర్తి 443 మార్కులు సాధించారు. ఎంఎల్టీ ద్వితీయ సంవత్సరంలో పి.నవీన్ 916, ప్రథమ సంవత్సరంలో ఎ.నిఖిత 480 మార్కులు సాధించారు. కంప్యూటర్ సైన్స్ ప్రథమ సంవత్సరంలో జి.తేజొన్నయి 456 మార్కులు సాధించింది.
సత్తాచాటిన యాదగిరిగుట్ట ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులు
యాదగిరిగుట్ట, మే 9 : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించి జిల్లాలోనే టాప్గా నిలిచారు. ఫస్టియర్ పరీక్షకు 104 మంది హాజరు కాగా, 89 మంది (85.58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బీపీసీ విద్యార్థిని అపర్ణ, ఎంపీసీ విద్యార్థిని జి.సౌమ్య 470 మార్కులకుగాను 399 సాధించి టాపర్గా నిలిచారు. హెచ్ఈసీ విద్యార్థిని క్రిష్ణవేణి 500/420 మార్కులు సాధించింది. సెకండియర్లో 113 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 106 మంది (93.81 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బీపీసీ విద్యార్థిని అనూరాధ 1000/962, ఎంపీసీ విద్యార్థిని నక్షత్రిక 1000/954 సాధించి టాపర్లుగా నిలిచారు.