శాలిగౌరారం, నవంబర్ 19: కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని అడ్లూర్, జాలోనిగూడెం, తిరుమలరాయినిగూడెం గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిచారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
రాష్ట్రం సమగ్రాభివృద్ధ్ది సాధించాలంటే మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో చేపట్టిన కొత్త పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విజన్ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కిశోర్కుమార్కు మద్దతుగా మండలంలోని జాలోనిగూడెం, తిరుమలరాయి నిగూడెంలో పాల్గొని ప్రచారం చేశారు.
మండలంలోని అడ్లూర్, జాలోనిగూడెం, తిరుమలరాయినిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా లక్ష్మీవెంకట్రెడ్డి, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, మహేందర్రెడ్డి, నూక సత్తయ్యయాదవ్, కంబాలపల్లి కృష్ణ, గంట శంకర్, శేఖర్బాబు, కొన్రెడ్డి వేణుగోపాల్రెడ్డి, కొత్త శంకర్రెడ్డి, బోడ నర్స య్య, గౌర వీరయ్య, జహంగీర్, ఎంపీటీసీ జోగు సైదమ్మ, పాల్గొన్నారు.