అర్వపల్లి, డిసెంబర్ 29 : అర్వపల్లి యోగానంద లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులతోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
మంత్రి సోదరుడు, నాగారం వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల-రమేశ్రెడ్డి దంపతుల కూతురు మేఘన- యువరాజ్రెడ్డి రిసెప్షన్ అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు తమ ఇలవేల్పు యోగానంద లక్ష్మీనర్సింహుడిని దర్శించుకొని నూతన వధూవరులతో కలిసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి-రేణుక దంపతులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుంటకండ్ల రామచంద్రారెడ్డి, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, ఆలయ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, ఎంపీటీసీ కనుకు పద్మాశ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కడారి నరేశ్ పాల్గొన్నారు.