నల్లగొండ, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో NSHES/TGGENCO నందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TGPEA JAC చైర్మన్ యాసయ్య, కన్వీనర్ సంజీవ రెడ్డి ఏడీఈ, టి.శ్రీను, రామక్రిష్ణ ఏఈ, సులక్ష్మి ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.