చిట్యాల : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ముగించుకొని తిరిగి చిట్యాల మీదుగా ఎర్రవెల్లికి వెళ్లే సమయంలో ఆ పార్టీ శ్రేణులు చిట్యాలలోని కనకదుర్గ దేవాలయం సెంటర్లో ఘనస్వాగతం పలికారు. దాదాపు 2 గంటల ముందు నుంచే పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కేసీఆర్ రాక కోసం సెంటర్లో ఎదురుచూశారు.
చిట్యాలకు చేరుకోగానే తన వాహనాన్ని స్లో చేసి వాహనం నుంచే కేసీఆర్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. స్వాగతం పలికిన వారిలో చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, ఎంపీటీసీలు దేవరపల్లి సత్తిరెడ్డి, దశరథ, మాజీ సర్పంచులు ఈసం బాబు, మర్రి జలంధర్రెడ్డి, నాయకులు కర్నాటి వెంకట్రెడ్డి, మర్ల రాంరెడ్డి, తుమ్మల నాగరాజురెడ్డి, మేడి ఉపేందర్, సన్యాసిరావు, రమేశ్రెడ్డి, మహేందర్రెడ్డి ఉన్నారు.