నల్లగొండ రూరల్, ఏప్రిల్ 13 : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం అదనపు కలెక్టర్తో పాటు డీఏస్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఆర్జాలబావి, కంచనపల్లి, కొత్తపల్లి ఐకేపీ కేంద్రాలను వారు సందర్శించి రైతులకు, కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్రావు, ఏపీఎం వినోద, సీఈఓ అనంతరెడ్డి, శ్రీనివాస్ రైతులు ఉన్నారు.