రామన్నపేట, జనవరి10 : మహిళపట్ల అసంభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చంపుతానని బెదిరించిన వ్యక్తికి మూడేండ్ల జైలు, రూ. 2వేల జరిమానా విధిస్తూ రామన్నపేట జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్. చందన మంగళవారం తీర్పు చెప్పారు. ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2015 జూన్ 12న మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మహిళ(35) ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కాడయ్య ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఆమె అతడి నుంచి తప్పించుకొని బయటికి రాగా పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. సాక్ష్యాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడికి జైలు, జరిమానా విధించారు. ఏపీపీ పి. వెంకట అవినాశ్ నిందితురాలి తరఫున వాదించారు.