సెకండ్ వేవ్లో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో బాలీవుడ్ లవర్స్ విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వారు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా ఇద్దరు కోలుకున్నారు. ఏప్రిల్ 16 శుక్రవారం రోజు తన ఇన్స్టాగ్రామ్లో నవ్వుతున్న ఫొటోని షేర్ చేస్తూ.. నెగెటివ్ వచ్చింది. మనోహరమైన సందేశాలకు ధన్యవాదాలు. కోలుకుంటున్న వారందరి కోసం నేను ప్రార్ధిస్తున్నాను. సురక్షితంగా ఉండండి అని పేర్కొన్నారు విక్కీ కౌశల్.
ఏప్రిల్ 17న కత్రినా కైఫ్కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మేకప్ లేకుండా దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ పేర్కొంది. కరోనా నుండి కోలుకోవాలని నా కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు చాలా ప్రేమ దక్కిందంటూ క్యాప్షన్ ఇచ్చింది కత్రినా. ఏదమైన ఒక్క రోజు తేడాతో ప్రేయసి ప్రియుడు కోలుకోవడం అభిమానులలో ఆనందం వెల్లివిరిసేలా చేసింది.