చివ్వెంల, ఫిబ్రవరి 16 : చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న ఆశ కార్యకర్తలకు గౌరవ ప్రదమైన వేతనం పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది రాష్ట్ర ప్రభుత్వం. నాడు పనిని బట్టి పారితోషికం ఇవ్వగా నేడు నెలకు రూ. అందజేస్తుండడంతో వారికి సంఘంలో మంచి గుర్తింపుతోపాటు ఆర్థిక తోడ్పాటు లభించింది.
మారిన అనసూర్య జీవనం
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావు పేటకు చెందిన గుగులోతు అనసూర్య 2006 సంవత్సరం నుంచి ఆశ కార్యకర్తగా పని చేస్తున్నది. గర్భిణుల ప్రసవం కింద 25 రూపాయలు ఇచ్చే వారు. నెలకు అన్ని కలిపి 250 రూపాయలు వచ్చేవి. అది కూడా గ్రామ సర్పంచ్ సంతకం చేసి ఇచ్చిన లెటర్ ద్వారా చెల్లించేవారు. నాడు ఖర్చులకు వేతనాలు సరిపోక కుటుంబ పోషణ భారంగా ఉండేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి బతుకుకు భరోసా ఏర్పడింది. అప్పటివరకు నెలకు రూ.1500 ఉన్న వేతనాన్ని 2014లో 7 వేల రూపాయలకు పెంచారు. 2022 జనవరి నుంచి 10 వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. ‘గడిచిన రోజులు చూసుకుంటే మాకు మా బంధువుల వద్ద కూడా సరైన గౌరం ఉండేది కాదు. ఇప్పుడు మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు.. పిల్లల చదువులు, ఇతర అవసరాలకు పెరిగిన వేతనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్ల మాకు గౌరవం దక్కింది. కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని అనసూర్య సంతోషంగా తెలిపింది.