న్యూఢిల్లీ, మే 23: కరోనాకు కొత్త తరహా చికిత్స విధానాలను రెడ్డీస్ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తున్నదని, ఈ విధానాలు కొన్ని నెలల్లో అందుబాటులోకి రావొచ్చని ఆ కంపెనీ కో చైర్మన్, ఎండీ జీ వరప్రసాద్ చెప్పారు. కరోనా సోకకుండా నిరోధించే అంశంపై ప్రత్యేకంగా పరిశోధనలు జరుపుతున్నట్టు తెలిపారు. ఓ వైపు కొత్త చికిత్స విధానాలను కనుగొంటూనే మరోవైపు మార్కెట్లో ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. భారత్లో ఆగస్టు కల్లా స్పుత్నిక్ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని, అప్పటివరకు రష్యా నుంచి టీకాలను దిగుమతి చేస్తామని కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రాయేలీ తెలిపారు. ఇండియలో 25 కోట్ల స్పుత్నిక్ వీ డోసుల ఉత్పత్తికి ఆర్డీఐఎఫ్తో ఒప్పందం ఉందని చెప్పారు.