హైదరాబాద్ : అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని అనాజ్పూర్లో రెండు నెలల పసికందును హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పసికందును చంపింది మేనత్త, మేనమామే అని పోలీసుల విచారణలో తేలింది. రెండు నెలల చిన్నారిని చంపి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో పడేశారు. మేనత్త శ్వేత, మేనమామ రాజుకు రెండేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికీ సంతానం కలగలేదు. తన ఆడపడుచుకు సంతానం కలగడంతో అసూయ పెంచుకున్న శ్వేత.. ఆ పసిబాబును కడతేర్చింది.
అనాజ్పూర్కు చెందిన లత, ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన తిరుమలేశ్ దంపతులు. వీరు ఎల్బీనగర్లో ఉంటున్నా రు. వీరికి 12 ఏండ్ల తర్వాత సంతానం కలిగింది. బిడ్డ పుట్టగానే ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. 15 రోజుల క్రితం లత, బాబు ఉమామహేశ్వర్(2 నెలలు)తో కలిసి అనాజ్పూర్కు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి బాబుకు పాలు ఇచ్చి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లత నిద్రలేచి చూసే సరికి కొడుకు కనిపించలేదు. చివరకు ఇంటిపైన వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు. చనిపోయిన బిడ్డను చూసిన లత కన్నీరుమున్నీరైంది.