తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 60 అడుగుల భారీ చిత్రం వేయించాడు. 20 గంటలకు పైగా కష్టపడి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శైలేష్ కులకర్ణి ఈ అద్భుత చిత్రాన్ని గీశారు.