శివ్వంపేట, ఫిబ్రవరి 18 : జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా సామా జిక సేవా కార్యక్రమాలకు అంకితమవడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలకేంద్రం శివ్వంపేటలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యం లో శనివారం జడ్పీటీసీ మహేశ్గుప్తా 44వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లపల్లిలో దివ్యాంగ విద్యార్థికి ల్యాప్ట్యాప్, శివ్వంపేటకు చెందిన షార్ట్ఫిలీం నిర్వాహకులకు కెమెరాలు, ఇంటింటికీ వాటర్టిన్నులు, నాలుగు కుటుంబాలకు రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం, శివ్వంపేట 5వ వార్డులో బోర్వెల్ ప నులు, 500 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ టీసీ చేపట్టారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మా ట్లాడుతూ.. జడ్పీటీసీ మహేశ్గుప్తా సేవలు రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజలకు ఆపద వస్తే నేనున్నానంటూ స్పందించి ఆదుకునే మానవతావాది, సేవామూర్తి అని అభి నందించారు. సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శమ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, కౌన్సిలర్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, రమేశ్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, నాయకులు లాయక్, హబీబ్ఖాన్, సుధీర్రెడ్డి, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, గంగాధర్, పద్మావెంకటేశ్, పోచాగౌడ్, కొండల్, గౌరీశంకర్, ముద్దగల్ల రాజు ఉన్నారు.