మెదక్ అర్బన్, ఆగస్టు 30 : మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని రాజుపేట గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన టీ పాయింట్, శివాని హార్డ్వేర్ షాప్ను సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలుసుకునేందుకు టీ పాయింట్లు ఉపయోగకరంగా ఉంటాయని పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా టీ పాయింట్తో పాటు హార్డ్వేర్ షాప్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్, సర్పంచ్ నార్ల సాయిలు, మాజీ సర్పంచ్ యామి రెడ్డి, నాయకులు సాయ గౌడ్, సతీష్ రావు, శ్రీనివాస్ రెడ్డి, సాప సాయిలు, రామచంద్రా రెడ్డి, నరేందర్ రెడ్డి, పోచయ్య, మల్లయ్య, బిక్షపతి రెడ్డి, సిద్ధిరామ్ రెడ్డి, సిద్ది రెడ్డి రాజేశ్వరరావు, సంతోష్ గౌడ్, పాండురంగారావు, బాబా గౌడ్, అశోక్, కిషన్, గోపాల్, పోచయ్య, రవి, నల్ల పోచయ్య, మల్లేశం, భూమయ్య, ఏసు, విట్టల్,మొగులయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.