మిరుదొడ్డి(అక్బర్పేట-భూంపల్లి), నవంబర్ 7: ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, పార్టీ సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, బోయ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఖాజీపూర్, రుద్రారం గ్రామాల్లో ఎంపీ ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కొత్త ప్రభాకర్రెడ్డి గెలుపునకు దోహదం చేస్తాయన్నారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి ఎంపీ ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పెర్క మమతామాధవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాలమల్లేశం గౌడ్, మాజీ ఎంపీపీ పంజాల కవితాశ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మీచిరంజీవి, ఉప సర్పంచ్ ప్రభాకర్, నాయకులు మురళి, రాజిరెడ్డి, వెంకట్రెడ్డి, ప్రభాకర్ రావు, పరశురాములు పాల్గొన్నారు.