మెదక్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం డాక్టర్స్ డే పురస్కరించుకొని మెదక్ పట్టణ శివారులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరైన మాట్లాడారు. రోగులకు ప్రాణం పోసే వైద్యులు దేవుడితో సమానమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. వైద్య కళాశాల ఏర్పాటుతో పేద వారికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో రానుందని తెలిపారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్యులకంటే ప్రభుత్వ వైద్యులంటేనే తనకు అభిమానమని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని, తాను చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మెదక్లో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగయ్యాయని, రూ.17కోట్లతో ఎంసీహెచ్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఎంసీహెచ్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాల్, నవీన్కుమార్, నర్సులు ఉన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
సంగారెడ్డిలో జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్ విట్టల్ను సన్మానించారు. కార్యక్రమంలో వైద్యులు ఇబ్రహీం, మహేందర్రెడ్డి, భాస్కర్, ఏవో విజయశాంతి, రవి, ప్రసన్న, నాగరాజు, చందర్ పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్ను నన్మానించారు. రేణుక ఎల్లమ్మ బోనా ల ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్లను సన్మానించారు.