తూప్రాన్/మనోహరాబాద్/సిర్గాపూర్, జూన్ 28 : రైతులు లాభసాటి వ్యవసాయం చేయడమే రైతుబంధు ముఖ్య ఉద్దేశమని, రైతులు ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తొమ్మిదో విడుత వానకాలం రైతుబంధు సాయం రైతుల ఖాతాలో నగదు జమ అవుతున్నందున తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెల్లిలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుబంధు సాయాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్, వైస్చైర్మన్ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సతీశ్చారి, నాయకులు సత్యనారాయణగౌడ్, భగవాన్ రెడ్డి, దుర్గారెడ్డి, శ్రీనివాస్, చంద్రారెడ్డి, బురాన్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మనోహరాబాద్లో..
రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్ గౌడ్ అన్నారు. రైతుబంధు పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తూ, మనోహరాబాద్లో మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ యంజాల సుధాకర్రెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు రేణుకా ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, అర్జున్, ఎంపీటీసీలు, నాయకులు జావీద్పాషా, చంద్రశేఖర్ ముదిరాజ్, భిక్షపతి, సత్యనారాయణ, సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
సిర్గాపూర్లో..
సిర్గాపూర్లో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి, రైతు బంధు సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కో-ఆప్షన్ సభ్యుడు బషీరొద్దీన్, మాధవరావుపాటిల్, యూత్ నాయకులు నర్సాగౌడ్, మారుతి పటేల్, రమేశ్, నర్సింహులు, ప్రవీణ్, సందీప్, బస్వరాజ్, హనుమాన్లు, బాలా జీ, ఇబ్రహీం, మాన్నప్ప, రైతులు పాల్గొన్నారు.