నర్సాపూర్,జూన్25: ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ప్రభుత్వ జూ నియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీందర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేరికకు ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో నర్సాపూర్ చుట్టుపక్కల గల ఉన్నత పాఠశాలలను సందర్శించారు. గ్రామాల్లో కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో అనుభవం గల అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేత నం అందుతుందన్నారు. అన్ని గ్రూపుల్లో ఆంగం, తెలుగు మాధ్యమాల్లో బోధన ఉంటుందన్నారు. హెచ్ఈసీ గ్రూప్లో ఉర్దూ మీడియం కూడా ఉందన్నారు. మెరిట్ విద్యార్థినులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభు త్వ కళాశాలలో చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో అ ధ్యాపకులు వీరాంజనేయు లు, కళింగరెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట, జూన్ 25: ప్రభుత్వ కళాశాలల్లోనే నా ణ్యమైన విద్య లభిస్తుందని జూనియర్ కళాశాల లెక్చరర్లు తెలిపారు. మండలంలోని జూకల్, పాపన్నపేట మండలం చీకోడ్ తదితర గ్రామాల్లో లెక్చరర్లు పదో తరగతి విద్యార్థుల ఇంటికి తిరుగుతూ అవగాహన క ల్పించారు. ఉచిత పుస్తకా లు, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యంపై వివరించారు. లెక్చరర్లు అనంత్రాజ్, శ్రీశైలం, రాజు, ప్రభాకర్, అభిలాశ్ ఉన్నారు.