చిలిపిచెడ్, జూన్ 19 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన తొలిరోజు నుంచే మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించడంతో జులై మొక్కల నాటడంతోపాటు ఇంటింటికీ మొక్కల పంపిణీకి సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు. హరితహారం, వైకుంఠధామాల్లో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. చిలిపిచెడ్ మండలంలో 19 గ్రామ పంచాయతీల్లో 19 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇందులో బండపోతుగల్ గ్రామ నర్సరీని అటవీశాఖ ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని నర్సరీల్లో హరితహారానికి మొక్కలను సిద్ధం చేశారు.
మండలంలో 2 లక్షల 97 వేల మొక్కల పెంపకం
త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల కొరత ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశా రు. చిలిపిచెడ్ మండలంలో ఉపాధిహామీ పథకం, అటవీశాఖ వేర్వేరుగా నర్సరీలను ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో 18 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 1 నర్సరీని ఏర్పాటు చేసి సుమారుగా 2.97 లక్షలకు పైగా మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలో 19 గ్రామాల్లో ఒక్కొక్కోక నర్సరీలో 13 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. బండపోతుగల్ గ్రామ నర్సరీలో 30 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నీడనిచ్చే టేకు, ఈత, వెదురు, కానుగ, వేప, చింత, రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు అనుకూలంగా ఉండే మొక్క లు, జామ, సపోట, అల్లనేరేడు పండ్ల మొ క్కలతో పాటు ఇంటి పెరట్లో పెంచడానికి వివిధ పూల మొక్కల ను పెంచుతున్నారు.
మొక్కల పెంపకంతో ఉపాధి..
గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, మొక్కల పెంపకంతో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. ఇందుకు అధికారులు సైతం చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలను పెంచడానికి అవసరమైన ప్లాస్టిక్ కవర్లో మట్టిని నింపడం, వాటిని క్రమపద్ధతిలో పేర్చడం, నీటిని పట్టడం, మొక్కలను పెంచడానికి అవసరమైన విత్తనాలను విత్తడం పనులు చేయడానికి కూలీలు అవసరం. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో వివిధ పనులు చేప ట్టడానికి ఉపాధిహామీ పథకంలో అవసరమైన కూలీలను నియమించుకుని ఉపాధి కల్పిస్తున్నారు.
సరిపడా మొక్కలను పెంచుతున్నాం..
చిలిపిచెడ్ మండలంలో 18 ఉపాధి హామీ, ఒకటి అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేశాం. హరితహారా నికి సరిపడేలా మొక్కలను పెంచుతాం. మండలంలో 2.97లక్షలకుపైగా మొక్క లను నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరి గా యి. జూన్, జూలై నెలల్లో నిర్వహించే హరితహారానికి సరిపడా మొక్కలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం.
– శ్యామ్కుమార్, చిలిపిచెడ్ మండల ఏపీవో