అమీన్పూర్, జూలై 3: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 9, 10, 14 వార్డుల్లో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ డ్రైన్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, అదే నమ్మకంతో అమీన్పూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకోని బీరంగూడ – కిష్టారెడ్డి పేట 100 ఫీట్ల రహదారిని నిర్మించామన్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణం నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజల మద్ధతుతో భవిష్యత్తులోనూ అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, కౌన్సిలర్లు కొల్లూరి మల్లేశ్, బిజిలి రాజు, కవిత శ్రీనివాస్, బాశెట్టి కృష్ణ, కల్పనాఉపేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు కాలప్ప, అనిల్, జగదీష్ గోపాల్, ప్రమోద్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు యూను స్, తలారి రాములు, దాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం, జూలై 3: కొన్నేండ్లుగా మల్లికార్జుననగర్ కాలనీలో ఉన్న పార్కు సమస్యను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరిష్కరించారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ నేతృత్వంలో కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్కు స్థలం పత్రాలను కాలనీ సొసైటీ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు కాలనీ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే, కార్పొరేటర్కు ఘన స్వాగ తం పలికి సన్మానించారు. కమ్యూనిటీ హాల్లో సమావేశం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి సొసైటీ సభ్యు లు, కాలనీవాసులతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్ పార్కు స్థలం వద్దకు వెళ్లి రిబ్బన్ కట్చేసి కాలనీకి అప్పగించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్కు స్థలాన్ని కాలనీ సొసైటీకి అప్పగించామన్నారు. ఈ విషయంలో సంపూర్ణ సహకారం కాలనీవాసులకు, పార్కు స్థలం యజమానిగా పేర్కొంటున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్కు స్థలం అందించిన వారికి ప్రత్యామ్నయం చూపించామని తెలిపారు. త్వరలోనే పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, కాలనీ అధ్యక్షుడు రాఘురాంరెడ్డి, ప్రధానకార్యదర్శి విఠల్, వర్కింగ్ ప్రసిడెంట్ బాల్రెడ్డి, అడ్వకేట్ గోవర్దన్, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, సత్యనారాయణ, మల్లేశ్, నర్సింహారెడ్డి, కృష్ణకాంత్ పాల్గొన్నారు.
జిన్నారం, జూలై 3 : తల్లిదండ్రులు లేని పేదింటి ముస్లిం యువతి వివాహానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. శివనగర్ గ్రామానికి చెందిన సోమియా నౌషిమ్ తల్లిదండ్రుల మృతితో మేనమామ సంరక్షణలో ఉంటు వివాహం నిశ్చయం కావడంతో ఆమె కుటుంబ పరిస్థితిని ఎంపీటీసీ సంతోశ్మహేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం క్యాంపు కార్యాలయంలో యువతి మేనమామకు రూ.20 వేలు నగదు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గఫూర్ ఉన్నారు.