బెజ్జంకి, జూలై 3: మండల కేంద్రంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగా మండలంలో ట్యాంక్బండ్కల నెరవేరింది. మండల కేంద్రంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా సుందరీకరిస్తానని ప్రకటించిన మంత్రి హరీశ్రావు, ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.1.84 కోట్లు మంజూరు చేసి హామీ నిలబెట్టుకున్నారు.
నిధులు విడుదల కావడంతో పనులను కాంట్రాక్టర్ ఆలస్యంగా నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే పనులను అనునిత్యం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి పనులను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్కు తగిన సూచనలు చేశారు.
గతంలో ఊర చెరువులో పూడికమట్టి చేరి, దట్టమైన చెట్లతో ఉండేది. మండల కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన దారిపక్కనే చెరువు ఉండటంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మినీట్యాంక్బండ్గా మార్చుతున్నారు. మొదటి విడతలో మిషన్కాకతీయ పథకంలో రూ.34.60 లక్షలు కేటాయించి చెరువు కట్ట, పిచ్చి మొక్కల తొలిగింపు, పూడిక మట్టితీత, మత్తడి తూములను అభివృద్ధి చేశారు.
చెరువును మరింత అభివృద్ధి చేయలన్న సంకల్పంతో ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు మినీట్యాంక్ బండ్ను తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. మంత్రి హరీశ్రావు కృషితో రూ.1.84 కోట్లు మంజూరయ్యాయి. మినీ ట్యాంక్ బండ్లో భాగంగా చెరువు కట్ట పనులు కొనసాగుతుండగా, బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేసి, హైమాస్లైట్లను ఏర్పాటు చేశారు.
మిగతా కట్టపై సీసీ, రేలింగ్, కట్ట దిగువ భాగంలో పచ్చటి గడ్డి, కట్టపై ప్రయాణికులు సేదతీరేందుకు కుర్చీలు, బోటింగ్తో ఆహ్లాదకరంగా మారనున్నది. మినీట్యాంక్బండ్ ఏర్పాటుతో ఆహ్లాదంతోపాటు, ఆయకట్టు రైతులకు సాగు నీరు అందనున్నది. ఊర చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారనుండడంతో మండల ప్రజలు, రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా లాక్డౌన్కు ముందు రోజుల్లో మెప్మా ఆధ్వర్యంలో సౌత్ అమెరికాలో నిర్వహించిన లిమాఫెయిర్ ఎగ్జిబిషన్కు కళాకారుడు మల్లేశంతో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తాము తయారు చేసిన పెయింటిగ్స్ తదితర సామగ్రితో వెళ్లి మూడు రోజులు మేళాలో కళలను ప్రదర్శించారు. 2020లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో మల్లేశంతోపాటు కళాకారులు హుటాహుటిన తమ సామగ్రి సర్దుకొని పనామా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అధికారులు కేవలం కళాకారులను మాత్రమే అనుమతించి, వారి సామగ్రి తీసుకుపోవడానికి నిరాకరించారు. దీంతో రూ.5 లక్షల స్టాక్ అక్కడే ఉండిపోయింది. కళాకారులు మాత్రం వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. దీంతో మల్లేశానికి చెందిన రూ.5లక్షల మేరకు చిత్రకళలు, సామగ్రి ఎయిర్పోర్టులో ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.