నర్సాపూర్, జూన్ 11: వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో వామ్స్ పేరుతో సాగుతున్న అంతర్జాతీయ 5వ ఐఈఈఈ వైర్లస్ యాంటిన్నాస్ మైక్రోవేవ్ 2026 సదస్సు గురువారం రెండో రోజుకు చేరుకుంది. మానవ సంక్షేమం సాంకేతిక వినియోగంపై అంతర్జాతీయ సదస్సులో వక్తలు మాట్లాడారు. శాట్లైట్ తయారు చేసే విధానం, పనితీరును వివరించారు. శాట్లైట్ ద్వారా గూగుల్, ఇంటర్నెట్, యూట్యూబ్ వంటివి నడుస్తున్నాయని తెలిపారు.
ప్రపంచంలో నావిగేషన్, వెదర్ రిపోర్ట్, అగ్రికల్చర్ గిజాస్టర్, కమ్యూనికేషన్ వాటిలో శాట్లైట్ పాత్ర గొప్పదని వివరించారు. అనంతరం వామ్స్ 2026 జనరల్ బీఆర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ సింపోజియంలో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన పరిశోధకులు పాల్గొంటారని తెలిపారు. సదస్సులో ప్రొఫెసర్ ఫిల్ వెనిజియా, డాక్టర్ సుధాకర్రావు, డాక్టర్ సతీశ్శర్మ, డాక్టర్ జావేద్ సిద్దిఖి, కెనెడ ప్రొఫెసర్ దేసేమందేసిమ్, ప్రొఫెసర్లు ఆండ్రియాల్లి, డిబాతోష్ గుహాలు, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజర్ బాపిరాజు, ఏవో సురేశ్ పాల్గొన్నారు.