రామాయంపేట/ చేగుంట, ఆగస్టు 27 : ప్రభుత్వ పాఠశా లల్లో ఉపాధ్యాయులు చేపడుతున్న విద్యాబోధన, ఆంగ్ల మా ధ్యమ విధానం అమలు, మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధనను కొనసాగించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని తల్లిదండ్రులు పేర్కొన్నారు. రామయంపేట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సమావేశాన్ని హెచ్ఎం శ్యామల ఆధ్యక్షత నిర్వహించారు. తల్లిదండ్రు లు తమ పిల్లలను పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించా లని ఉపాధ్యాయులు సూచించారు. పిల్లలు బడికి వస్తేనే విద్యఅలవడుతుందన్నారు. రామాయంపేట ప్రభుత్వ పాఠశాలలో 226 మంది విద్యార్థులు కొత్తగా చేరారని తెలిపారు. తల్లిదండ్రులు సహకరిస్తే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. విద్యార్థ్థులకు మెనూ ప్రకారం భోజనంఅందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో టీచర్లు శంషుద్దీన్, లక్ష్మి, స్వామి ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభి స్తుందని రెడ్డిపల్లి, చందాయిపేట సర్పంచ్లు కాశగోని లక్ష్మి, బుడ్డ స్వర్ణలత పేర్కొన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి, చం దాయిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పేరెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, విద్యాబోధన ఇతర విషయాలను ఉపా ధ్యాయులు వివరించారు. సమావేశాల్లో హెచ్ఎంలు కర్రోళ దేవయ్య, బాలచంద్రం, ఉప సర్పంచ్లు సంతోశ్కుమార్, బాలరాజు, పంచాయతీ కార్యదర్శి సమీనాసుల్తానా ఉన్నారు.