మెదక్ రూరల్/ కొల్చారం డిసెంబర్ 7 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉన్నాయని మెదక్ వ్యవసాయ సహకార సం ఘం చైర్మన్ హన్మంత్రెడ్డి అన్నారు. పీఏసీఎస్ కార్యాలయం లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో సాగు చేసే పంటల విత్తనాలు, అవసమయ్యే ఎరువులు మెదక్ పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘంలో ఉన్నాయన్నారు. తెలంగాణ టీజీఎల్ 24423 , తెలంగాణ 118, తెలంగాణ 1010, కిసాన్ 1010, 118, 453 , 456, ఆర్ఎన్ఆర్ లక్ష్మీ 999, శ్రీదుతి, జానకీ తదితర కంపెనీల విత్తనాలు ఉన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు అవసరమున్న రైతులు పట్టాపాస్బుక్ తీసుకొని వచ్చి, తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.
కొల్చారంలోని రైతు ఆగ్రోసేవా కేంద్రంలో వివిధ పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు కొల్చారం మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి తెలిపారు. ఎంటీయూ 1010 రకం 25కిలోల బస్తా రూ.882.50, కేఎన్ఎం 118 రకం 25కిలోల బస్తా రూ.882.50, ఆర్ఎన్ఆర్ 15048 రకం 25కిలోల బస్తా రూ.850, జేజీఎల్ 24423 రకం 25 కిలోల బస్తా రూ. 882.50, పొద్దుతిరుగుడు విత్తనాలు కేబీఎస్హెచ్ 41 రకం 2 కిలోల బస్తా రూ.1360, కేబీఎస్హెచ్ 44 రకం 2 కిలోల బస్తా రూ.1360, మొక్కజొన్న డీహెచ్ఎం-117 రకం 5కిలోల బస్తా ధర రూ.575 ఉందన్నారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్స్ చూపించి, ఆగ్రోసేవా కేంద్రం లో విత్తనాలను తీసుకువాలని ఏవో శ్వేతకుమారి కోరారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదు ఖాతాల్లో జమ కావాలంటే రైతులందరూ ఈకేవైసీ (ధ్రువీకరణ) తప్పనిసరి గా చేసుకోవాలని మెదక్ ఏడీ విజయనిర్మల సూచించారు. మెదక్ మండల వ్యవసాయ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన నిధి పథకానికి అర్హులైన రైతులకు ఈ -కేవైసీ చేశారు. ఈ సందర్భంగా ఏడీ విజయనిర్మల మాట్లాడుతూ.. రైతుబంధు మాదిరిగానే కేంద్రంం కిసాన్ సమ్మాన్నిధి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పథకంలో భాగంగా ఏటా మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున రూ.6 వేలు అందజేస్తున్నద న్నారు. ఇప్పటివరకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ య్యేది. ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేసిన రైతు ఖాతాలోనే డబ్బు లు జమ అవుతాయన్నాయి. రైతులు కామన్ సర్వీస్, మీసేవ సెంటర్కు వెళ్లి బయో మెట్రిక్ చేసుకోవాలని సూచించారు. ర్యాలమడుగు గ్రామంలోని రైతువేదికలో రైతులకు ఈ -కేవై సీపై ఏవో శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శేఖర్, భార్గవి, శరణ్య ఉన్నారు.